తిత్లీ బాధితులకు అండ.. విజయ్ దేవరకొండ..
- October 14, 2018సినిమాల్లో హీరోలు అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. కానీ నిజజీవితంలో కూడా అవసరమైనప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి చేయూతనందిస్తారు కొందరు హీరోలు. వారే నిజమైన హీరో అనిపించుకుంటారు.
మొన్న పక్కరాష్ట్రం కేరళ వరదబాధితుల్ని అక్కున చేర్చుకుని అండగా నిలబడింది తెలుగు ఇండస్ట్రీ. అదే విధంగా ఇప్పుడు తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలకు భారీ నష్టం సంభవించడంతో సీఎం చంద్రబాబు కేంద్ర సాయాన్ని కోరారు. బాధితులకు అండగా నటుడు సంపూర్ణేష్ బాబు ముందుగా స్పందించి కొంత సాయమందించారు. మరో నటుడు విజయ్ దేవరకొండ రూ.5 లక్షల సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపినట్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లేహ్లో ఉన్న తనకు ఇక్కడకు వచ్చాకే తిత్లీ తుఫాను గురించి తెలిసిందని వెంటనే స్పందించానని అన్నారు. గతంలో కేరళను ఆదుకున్న మనం ఇప్పుడు మన వారిని కూడా పెద్దమనసుతో ఆదుకోవాలంటూ విజయ్ పిలుపునిచ్చారు’. ఇంతకు ముందు కూడా తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చి తన గొప్పమనసు చాటుకున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు