నార్తరన్ గవర్నరేట్ స్కూల్లో కార్పొరేల్ పనిష్మెంట్
- October 15, 2018బహ్రెయిన్:నార్తరన్ గవర్నరేట్లోని ఓ పబ్లిక్ స్కూల్లో ఎలిమెంటరీ విద్యను అభ్యసిస్తోన్న తమ చిన్నారిపై టీచర్ దారుణంగా దాడి చేసినట్లు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు బాధిత చిన్నారి తండ్రి. హోస్తో చిన్నారిపై అతి కిరాతకంగా టీచర్ దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తమ చిన్నారి, టీచర్ కొట్టడంతో తీవ్రమైన నొప్పికి గురయ్యాడనీ, బాధతో విలవిల్లాడిన చిన్నారిని అడిగితే, విషయం వెల్లడించడం జరిగిందని బాధితుడి తండ్రి చెప్పారు. తమ చిన్నారిపై దాడికి సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్కి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు బాధిత చిన్నారి తండ్రి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొట్టడమే కాకుండా, అసభ్యకరంగా చిన్నారిని టీచర్ తిట్టినట్లు ఫిర్యాదులో వివరించారు బాధిత చిన్నారి తండ్రి.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్