రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 15, 2018దుబాయ్లోని పామ్ జుమైరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక బరువు కారణంగా ట్రక్ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో పండ్లు, కూరగాయలు వున్నాయి. దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్ మాట్లాడుతూ, ఉదయం 5.50 నిమిషాలకు ప్రమాదం జరగ్గా, వెంటనే పోలీసులు అలర్ట్ అయినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశామనీ, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతోపాటుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కల్నల్ అల్ కాసిమ్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ