దారుణ ఘటన: ప్రముఖ మోడల్ హత్య...బ్యాగులో మృతదేహం లభ్యం
- October 16, 2018ముంబై: ఓ అందాల మోడల్ ను హతమార్చి ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి చెత్తకుండీలో పడేసిన దారుణ ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేస్తున్నారు. ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ ఆరునెలలక్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్ నగర్ లో నివాసముండేది. అంధేరికి చెందిన సయ్యద్ (19) అనే విద్యార్థి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ కార్యక్రమంలో సయ్యద్ కు మోడల్ మానసిదీక్షిత్ తో స్నేహం ఏర్పడింది. మానసి దీక్షిత్ తో గొడవపడిన సయ్యద్ ఆమెను చంపి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి దాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు. స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి బ్యాగు విప్పి చూడగా మోడల్ మానసి దీక్షిత్ మృతదేహం కనిపించింది. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా సయ్యద్ క్యాబ్ లో తీసుకువచ్చి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తేలింది. దీంతో పోలీసులు సయ్యద్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం