గోరు వెచ్చని నీళ్లు.. గుండెకు పదిలం..
- October 18, 2018
గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాగించేది. నిరంతరాయంగా పని చేస్తున్న గుండె ఓ క్షణకాలమైనా అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. మంచి ఆహారంతో పాటు, వ్యాయామం, గోరు వెచ్చటి నీటితో స్నానం లాంటివి పాటిస్తే మంచిది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
జపాన్ పరిశోధకులు సుమారు ఎనిమిదివందలమంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చనీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈరోజునుంచే పాటించేస్తే గుప్పెండంత గుండె భద్రం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి