గోరు వెచ్చని నీళ్లు.. గుండెకు పదిలం..
- October 18, 2018గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాగించేది. నిరంతరాయంగా పని చేస్తున్న గుండె ఓ క్షణకాలమైనా అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. మంచి ఆహారంతో పాటు, వ్యాయామం, గోరు వెచ్చటి నీటితో స్నానం లాంటివి పాటిస్తే మంచిది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
జపాన్ పరిశోధకులు సుమారు ఎనిమిదివందలమంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చనీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈరోజునుంచే పాటించేస్తే గుప్పెండంత గుండె భద్రం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్