ఈ నెల 20న రాహుల్ టూర్లో స్వల్పమార్పు
- October 18, 2018
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ….. తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే… రేపటి పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కానీ తాజాగా రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది..
తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి ముందుగా బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం…. 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డి బహిరంగ సభలో ప్రసగింస్తారు. ఆ తర్వాత .అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ పర్యటనతో తెలంగాణలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ రేపు ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ షెడ్యూల్ను మార్చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి