'2.0' చిత్రం నుండి లిరికల్ వీడియోలు విడుదల
- October 20, 2018స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ 2.ఓ. నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల కాగా, ఈ టీజర్ 24 గంటలలో 32 మిలియన్స్కి పైగా వ్యూస్ రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం అందరిని అబ్బురపరచగా, చివరలో రజనీ స్పెడ్స్ని పైకి ఎత్తి కుకూ అంటూ చెప్పే డైలాగ్ అభిమానులు ఉర్రూతలూగేలా చేసింది. ఈ చిత్రం కోసం 1000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ పని చేయగా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు 10, 3డీ డిజైనర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మాన్ 500 మంది పని చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీజాక్సన్లు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు 545 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించింది లైకా సంస్థ. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచుతుంది. తాజాగా రెండు లిరికల్ సాంగ్ వీడియోలని విడుదల చేసింది మూవీ టీం. ఎందిర లోగొత్తు సుందరియ, రాజాలి అంటూ సాగే ఈ పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన బాణీలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్