ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
- October 20, 2018
నటుడు వైజాగ్ ప్రసాద్(75) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించి పలు ఆఫర్స్ పొందారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







