ఆకాశంలో విందు.. ఆరగిస్తే ఆదమరచీ పోతారు..!
- October 21, 2018ఆకాశంలో.. 160 అడుగుల ఎత్తులో మనకు ఇష్టమైన విందు ఆరగిస్తూ ఉంటే.. అబ్బా.. ఆ రుచే వేరే.. ఇలా ఆలోచిస్తుంటే ఆదమరచీ కలకాలం అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కదా..! అంత ఎత్తులో గాల్లో వేలాడుతూ అలాంటి థ్రిల్ను అనుభవించాలంటే మనం బెంగళూరు వెళ్లాల్సిందే. ‘జంపింగ్ ఇండియా అనే అడ్వేంచర్ స్పోర్ట్స్ కంపెనీ’ ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్’ ఎక్స్పీయరెన్స్ని దేశంలో తొలిసారిగా బెంగళూరులో ప్రారంభించింది.
మాన్యతా టెక్ పార్క్లోని నాగవర లేక్ ఒడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ 160 అడుగుల వరకు గాల్లో ఎగురుతుంది. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్ టేబుల్తో ఉండే ఈ రెస్టారెంట్ను క్రేన్ ద్వారా పైకి లేపుతారు. అంతా ఎత్తు నుంచి పడిపోకుండా ఉండేందుకు మూడు సీట్ బెల్టులను అమర్చారు. ఇలా ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఇదే కావటం విశేషం.
అయితే ఈ రెస్టారెంట్లోకి అందరిని అనుమతించారు. ఇందులోకి వెళ్లాలంటే కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువుతో సంబంధం లేదు.. ఎంతైనా ఉండవచ్చు. గర్భిణీలు, 14 ఏళ్ల లోపు చిన్నారులను ఈ రెస్టారెంట్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు