కాసేపట్లో కీలకతీర్పు వెల్లడించనున్న సర్వోన్నత న్యాయస్థానం

- October 22, 2018 , by Maagulf
కాసేపట్లో కీలకతీర్పు వెల్లడించనున్న సర్వోన్నత న్యాయస్థానం

దేశవ్యాప్తంగా దీపావళి క్రాకర్స్‌ తయారీ, అమ్మకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది..   

రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, క్రాకర్స్‌పై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ క్రాకర్స్‌ తయారీ, అమ్మకాల నిషేధంపై ఇవాళ… సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు టపాసుల తయారీ దారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com