ఐదుగురు భారతీయుల హత్య కేసులో ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష
- October 22, 2018
సౌదీ అరేబియా ఈస్టర్న్ ఏరియా క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. నిందితులు ముగ్గురూ సౌదీలే. మృతులు భారతీయులు. ఐదుగురు భారతీయుల్ని, ఫామ్ హౌస్లో విందుకు పిలిచిన నిందితులు, డ్రింక్స్లో మత్తు పదార్థాల్ని కలిపి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే చంపేశారు. వారి దగ్గరనుంచి నిందితులు డబ్బుని, మొబైల్ ఫోన్లనీ దోచుకున్నారు. అనంతరం మృతదేహాల్ని ఓ పెద్ద గోతిలో ఖననం చేసేశారు. హత్య కేసుతోపాటుగా, వీరిపై లిక్కర్ ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు, హాష్ స్మోకింగ్ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేయడంతో, వారికి మరణ శిక్షను కూడా అమలు చేసేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







