ఐదుగురు భారతీయుల హత్య కేసులో ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష

- October 22, 2018 , by Maagulf
ఐదుగురు భారతీయుల హత్య కేసులో ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష

సౌదీ అరేబియా ఈస్టర్న్‌ ఏరియా క్రిమినల్‌ కోర్టు, ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. నిందితులు ముగ్గురూ సౌదీలే. మృతులు భారతీయులు. ఐదుగురు భారతీయుల్ని, ఫామ్‌ హౌస్‌లో విందుకు పిలిచిన నిందితులు, డ్రింక్స్‌లో మత్తు పదార్థాల్ని కలిపి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే చంపేశారు. వారి దగ్గరనుంచి నిందితులు డబ్బుని, మొబైల్‌ ఫోన్లనీ దోచుకున్నారు. అనంతరం మృతదేహాల్ని ఓ పెద్ద గోతిలో ఖననం చేసేశారు. హత్య కేసుతోపాటుగా, వీరిపై లిక్కర్‌ ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు, హాష్‌ స్మోకింగ్‌ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేయడంతో, వారికి మరణ శిక్షను కూడా అమలు చేసేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com