రహమాన్ తో చాలాసేపు ముచ్చటించిన ప్రభాస్

- October 25, 2018 , by Maagulf
రహమాన్ తో చాలాసేపు ముచ్చటించిన ప్రభాస్

బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం సాహో తో పాటు తన 20 వ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ను కలవడం జరిగిందట. రహమాన్ తో చాలాసేపు ముచ్చటించి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఈ ఫొటోస్ ఇప్పుడు బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భాంగా 'సాహో' మేకింగ్ వీడియో విడుదలై అభిమానులనే కాదు యావత్ సినీ అబిమానులను ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ లో చిత్ర సన్నివేశాలు ఉండడం తో ఇంకాస్త సినిమాపై అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com