బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జాయర్ బోసానారు
- October 29, 2018
సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసా నారు(63) బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్పై ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. బోసానారుకు 55.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన బోసానారు ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు. గత నాలుగు సార్లు లెఫ్ట్ పార్టీకి పట్టంకట్టిన బ్రెజిల్ ప్రజలు..మార్పు కోసం ఈసారి బోసానారుకు అధికారం అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బోసానారు గెలుపుపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజ్యాంగం, వైవిధ్యం, భిన్నత్వం పరిరక్షించి ప్రజలను ఏకంచేస్తానని ఆయన తన తొలి సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







