బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జాయర్ బోసానారు
- October 29, 2018సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసా నారు(63) బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్పై ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. బోసానారుకు 55.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన బోసానారు ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు. గత నాలుగు సార్లు లెఫ్ట్ పార్టీకి పట్టంకట్టిన బ్రెజిల్ ప్రజలు..మార్పు కోసం ఈసారి బోసానారుకు అధికారం అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బోసానారు గెలుపుపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజ్యాంగం, వైవిధ్యం, భిన్నత్వం పరిరక్షించి ప్రజలను ఏకంచేస్తానని ఆయన తన తొలి సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా