భారత్-జపాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు
- October 29, 2018
హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, నావికా రంగ సహకారంతో సహా భారత్-జపాన్లు సోమవారం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మంత్వ్రి స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చేందుకు అంగీకరించాయి. ప్రధాని మోడి, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య సోమవారం టోక్యోలో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితితో సహా పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలి రువురు చర్చించారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాల కోసం రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో మంత్రిత్వ స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చాలని తాము ఒక అంగీకారానికి వచ్చినట్లు మోడి తెలిపా రు. భారత్-జపాన్ల మధ్య 13వ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోడి మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. దాదాపు 75 బిలియన్ డాలర్ల నోట్ల మార్పిడి ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య జరిగిందని తెలిపారు. భారత్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్లో మదుపుదారులు ప్రకటించారని మోడి చెప్పారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ప్రాజెక్టు పురోగతిపై కూడా తాము చర్చించుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







