భారత్-జపాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు
- October 29, 2018హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, నావికా రంగ సహకారంతో సహా భారత్-జపాన్లు సోమవారం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మంత్వ్రి స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చేందుకు అంగీకరించాయి. ప్రధాని మోడి, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య సోమవారం టోక్యోలో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితితో సహా పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలి రువురు చర్చించారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాల కోసం రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో మంత్రిత్వ స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చాలని తాము ఒక అంగీకారానికి వచ్చినట్లు మోడి తెలిపా రు. భారత్-జపాన్ల మధ్య 13వ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోడి మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. దాదాపు 75 బిలియన్ డాలర్ల నోట్ల మార్పిడి ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య జరిగిందని తెలిపారు. భారత్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్లో మదుపుదారులు ప్రకటించారని మోడి చెప్పారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ప్రాజెక్టు పురోగతిపై కూడా తాము చర్చించుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు