భారత్-జపాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు
- October 29, 2018హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, నావికా రంగ సహకారంతో సహా భారత్-జపాన్లు సోమవారం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మంత్వ్రి స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చేందుకు అంగీకరించాయి. ప్రధాని మోడి, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య సోమవారం టోక్యోలో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితితో సహా పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలి రువురు చర్చించారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాల కోసం రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో మంత్రిత్వ స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చాలని తాము ఒక అంగీకారానికి వచ్చినట్లు మోడి తెలిపా రు. భారత్-జపాన్ల మధ్య 13వ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోడి మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. దాదాపు 75 బిలియన్ డాలర్ల నోట్ల మార్పిడి ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య జరిగిందని తెలిపారు. భారత్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్లో మదుపుదారులు ప్రకటించారని మోడి చెప్పారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ప్రాజెక్టు పురోగతిపై కూడా తాము చర్చించుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి