'రోబో 2.0' ట్రైలర్
- November 03, 2018
సూపర్స్టార్ రజినీకాంత్కు ఒక్క తమిళంలోనే కాక ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.రజనీ సినిమాలు విడుదల అవుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు.ఇక తెలుగులో కూడా రజనీకాంత్కు మంచి మార్కెట్ ఉంది.రజినీ సినిమాలు విడుదల రోజున కార్పొరేట్ కంపెనీలు సైతం ఆ రోజున సెలవు ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రజినీ నటించిన గత రెండు సినిమాలు సరైన విజయాలు సాధించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు తలైవా అభిమానులు.రోబో 2.0 కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రెండు సంవత్సరాలు క్రితం మొదలైన 2.0 సినిమాకు స్ఠార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.
ఈ రోజు(శనివారం) రోబో 2.0 ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రపంచం మొత్తం టెక్నలజీ చూట్టు తిరుగుతు వాతవారణాన్ని లెక్క చేయకపోవడంతో ప్రజలపై ప్రతికారం తీర్చుకునే క్యారెక్టర్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. సెల్ ఫోన్ వాడుతున్న వారందరు శత్రువులుగా భావించిన విలన్ వారిపై దాడికి తిగుతాడు. అక్షయ్ కుమార్ తన దగ్గర ఉన్న అద్బుత శక్తులతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాడు..అక్షయ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.దీంతో చిట్టి ది రోబోని మళ్లీ బాహ్య ప్రపంచలోకి తీసుకు వచ్చి ప్రజలను కాపాడామంటారు. ఇక సినిమాలో వీరిద్దరి(అక్షయ్- రజినీ) మధ్య జరిగే సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు శంకర్.రోబోకి ధీటుగా ఉండే మరో క్యారెక్టర్ డిజైన్ చేయడంలో శంకర్ సక్సెస్ సాధించారు.ఇక విలన్గా అక్షయ్ పాత్ర సినిమాకే హైలెట్ కానుందని ఈ ట్రైలర్ను చూస్తుంటే అర్థం అవుతుంది.
ఇక రజినీ విషయానకి వస్తే ఇంత వయస్సు వచ్చిన ఏమాత్రం వన్నె తగ్గని నటనతో రెచ్చిపోతున్నారు.చిట్టిగా రజనీ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ కానుంది. సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అమీ జాక్సన్ కూడా రోబో అని ట్రైలర్ను చూస్తుంటే అర్థం అర్థం అవుతుంది.ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్లనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో ఊహాకే అందడం లేదు.ఇక సినిమాలో గ్రాఫిక్స్కు ఎక్కవుగానే ఖర్చు పెట్టారు.రోబో 2.0 ఇండియన్ సినిమాను మరో లెవల్కి తీసుకువెళ్తందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి