బహ్రెయిన్లో తమిళ్ కల్చరల్ ఫెస్టివల్
- November 03, 2018
తమిళ భాష, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇండియన్ క్లబ్ వద్ద కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు. బహ్రెయిన్ తమిళ్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ క్లబ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మలేసియా పెనాంగ్ స్టేట్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ పి.రామస్వామి ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్గా హాజరయ్యారు. భారత పార్లమెంటు మాజీ సభ్యుడు వైకో, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా, మలేసియాతోపాటు పలు గల్ఫ్ దేశాల్లోని తమిళ లిటరరీ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా వుందన్నారు. వైకో మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం తమిళనాడుకు వుందని చెప్పారు. తమిళ లిటరేచర్లో బహ్రెయిన్ గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన వుందని వైకో తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్