బహ్రెయిన్లో తమిళ్ కల్చరల్ ఫెస్టివల్
- November 03, 2018
తమిళ భాష, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇండియన్ క్లబ్ వద్ద కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు. బహ్రెయిన్ తమిళ్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ క్లబ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మలేసియా పెనాంగ్ స్టేట్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ పి.రామస్వామి ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్గా హాజరయ్యారు. భారత పార్లమెంటు మాజీ సభ్యుడు వైకో, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా, మలేసియాతోపాటు పలు గల్ఫ్ దేశాల్లోని తమిళ లిటరరీ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా వుందన్నారు. వైకో మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం తమిళనాడుకు వుందని చెప్పారు. తమిళ లిటరేచర్లో బహ్రెయిన్ గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన వుందని వైకో తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







