బహ్రెయిన్లో తమిళ్ కల్చరల్ ఫెస్టివల్
- November 03, 2018
తమిళ భాష, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇండియన్ క్లబ్ వద్ద కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు. బహ్రెయిన్ తమిళ్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ క్లబ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మలేసియా పెనాంగ్ స్టేట్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ పి.రామస్వామి ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్గా హాజరయ్యారు. భారత పార్లమెంటు మాజీ సభ్యుడు వైకో, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా, మలేసియాతోపాటు పలు గల్ఫ్ దేశాల్లోని తమిళ లిటరరీ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా వుందన్నారు. వైకో మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం తమిళనాడుకు వుందని చెప్పారు. తమిళ లిటరేచర్లో బహ్రెయిన్ గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన వుందని వైకో తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







