పౌరుడ్ని దోచుకున్న వలసదారుడి అరెస్ట్
- November 03, 2018
మస్కట్: ఆఫ్రికా జాతీయుడైన ఓ నిందితుడు, ఒమనీ పౌరుడి వద్ద నుంచి 160,000 దిర్హామ్లు దోచుకున్న నేరానికిగాను, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్బుని రెండింతలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన నిందితుడు, బాధితుడ్ని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎంక్వయిరీ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - అల్ దహిరా గవర్నరేట్ నిందితుడ్ని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో పట్టుకోవడం జరిగింది. రెట్టింపు డబ్బు ఇస్తానని నిందితుడు చెప్పడంతో, గుడ్డిగా నమ్మిన బాధితుడు నిందితుడికి 160,000 దిర్హామ్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్రాడ్కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ తాలూకు బ్యాంక్ రిసీప్ట్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్