తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం

- November 04, 2018 , by Maagulf
తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం

అమరావతి:తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తుఫాను వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు చెక్కులు సిద్దం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబునాయుడు బాధితులకు చెక్కులు అందించనున్నారు. ఇందుకోసం సుమారు 5వందల కోట్ల రూపాయలు సాయంగా అందించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చొరవ తీసుకోవడంతో త్వరితగతిన చెక్కులు సిద్దమయ్యాయి. అధికారులు రేయింబవళ్లు శ్రమించి నష్టం అంచనాలు రూపొందించి నివేదికలు సిద్దం చేశారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా… బాధితులకు పరిహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com