ఇటలీలో భీకర తుఫాన్
- November 04, 2018మిలాన్/రోమ్: ఇటలీలో సంభవించిన భీకర తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిసి వరద పెరుగడంతో 17 మంది మరణించారు. దాదాపు 1.4 కోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు గంటకు 180 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. చెట్లు విరిగి మీద పడటంతోనే ఎక్కువ మంది మరణించారు. సిసిలీ, ట్రెన్టినో, వెనిటో రాష్ర్టాలను తుఫాన్ కుదిపేసింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు మాట్లాడుతూ తుఫాన్ ధాటికి భారీగా విధ్వంసం జరిగిందని, తిరిగి కోలుకోవడానికి దాదాపు 100 ఏండ్లు పట్టవచ్చని చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని తెలిపారు. వరద పెరుగడంతో పాఠశాలలను మూసివేశామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రధానంగా ఇటలీ ఉత్తర ప్రాంతం, వెనిస్ చుట్టుపక్కల ప్రభావం చూపిందని, దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..