ఇటలీలో భీకర తుఫాన్
- November 04, 2018
మిలాన్/రోమ్: ఇటలీలో సంభవించిన భీకర తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిసి వరద పెరుగడంతో 17 మంది మరణించారు. దాదాపు 1.4 కోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు గంటకు 180 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. చెట్లు విరిగి మీద పడటంతోనే ఎక్కువ మంది మరణించారు. సిసిలీ, ట్రెన్టినో, వెనిటో రాష్ర్టాలను తుఫాన్ కుదిపేసింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు మాట్లాడుతూ తుఫాన్ ధాటికి భారీగా విధ్వంసం జరిగిందని, తిరిగి కోలుకోవడానికి దాదాపు 100 ఏండ్లు పట్టవచ్చని చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని తెలిపారు. వరద పెరుగడంతో పాఠశాలలను మూసివేశామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రధానంగా ఇటలీ ఉత్తర ప్రాంతం, వెనిస్ చుట్టుపక్కల ప్రభావం చూపిందని, దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!