దివాలీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న పాకిస్తానీ మహిళ
- November 07, 2018రాఫెల్ టిక్కెట్లపై 40,000 దిర్హామ్లు ఖర్చు చేస్తూ వచ్చిన ఓ యూఏఈ రెసిడెంట్ ఎట్టకేలకు 1 మిలియన్ డాలర్స్ని గెల్చుకోవడం జరిగింది. రఫాలె గెల్చుకున్న ఆనందంతో ఆ విజేత షాక్కి గురయ్యారట. పాకిస్తానీ జాతీయురాలు ఫెహ్మిదా తన్వీర్ ఈ బహుమతిని గెల్చుకున్నారు. పన్నెండేళ్ళుగా దుబాయ్లో నివసిస్తోన్న తన్వీర్, హౌస్వైఫ్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రా ఈవెంట్లో ఇండియన్ కాన్సుల్ జనరల్ పాల్గొన్నారు. సంప్రదాయ ఇండియన్ డాన్స్ (కథక్) ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రీవియస్ విన్నర్ సౌరవ్ డేకి ప్రెజెంటేషన్ అందించారు. కాగా, కువైట్కి చెందిన ఫైసల్ సలీమ్ అల్ మసౌద్, బెంట్లే బెంటాయాగా కార్ని గెల్చుకున్నారు. ఆస్ట్రేలియా జాతీయుడైన ఆండ్రూ బోక్సాల్, ఇండియన్ స్కౌట్స్ మోటార్ బైక్ని గెలుపొందారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు