ఛారిటీ రన్లో 3 వేల మంది..
- November 10, 2018బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్లో 3 వేల మంది రన్నర్స్, 200 టీమ్లుగా పార్టిసిపేట్ చేశారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే, బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రోటరాక్ట్ బహ్రెయిన్ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ఈవెంట్ని నిర్వహించారు. బిఎంఆర్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ హిషాంగ్ కెవల్రామ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ మారథాన్ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్ బహ్రెయిన్లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు