ఛారిటీ రన్లో 3 వేల మంది..
- November 10, 2018
బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్లో 3 వేల మంది రన్నర్స్, 200 టీమ్లుగా పార్టిసిపేట్ చేశారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే, బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రోటరాక్ట్ బహ్రెయిన్ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ఈవెంట్ని నిర్వహించారు. బిఎంఆర్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ హిషాంగ్ కెవల్రామ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ మారథాన్ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్ బహ్రెయిన్లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







