అనారోగ్యంతో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి
- November 11, 2018బెంగళూరు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంత్ కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్కు సంబంధించి చికిత్సను అదే ఆసుపత్రిలో తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ శంకర్ ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. 1959 సెప్టెంబర్ 22న అనంత్ కుమార్ బెంగళూరులో జన్మించారు. వాజ్పేయ్ ప్రధాన మంత్రిగా పనిచేసినప్పుడు.. ఆయన మంత్రివర్గంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంత్ కుమార్ ఆరు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1996లో తొలిసారిగా లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014లో రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ను నిర్వర్తించారు. జులై 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
అనంత్ కుమార్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనంత్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి, కర్ణాటక ప్రజలకు తీరని లోటన్నారు. అనంత్ కుటుంబ సభ్యులకు, సహచరులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అనంత్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకుడిగా ఉన్నప్పుడే అనంత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారని.. అప్పటి నుంచి ఆయన మరణం దాకా సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు. తను చేసిన మంచి పని వల్ల ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో అనంత్ ప్రముఖ పాత్ర పోషించారని ప్రధాని గుర్తు చేశారు. ఈసందర్భంగా అనంత్ భార్య తేజస్విని, మిగితా కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం