అమెరికా:భీకరమైన మంటలు.. 42 మంది మృతి..
- November 13, 2018అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 42 మంది మరణించారు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.
మంటలను అదుపుచేసేందుకు 8వేల మంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50వేల నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని, దాదాపు రెండులక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!