ప్రత్యేక దేశం కావాలంటున్న అఫ్రిది
- November 14, 2018
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తన నోటికి పనిచెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడు. తాజాగా అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ పార్లమెంట్ లో విద్యార్ధులతో ముచ్చటించిన అఫ్రీది..కశ్మీర్ ను వదిలేయండి. నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేని మీకు కశ్మీర్ ఎందుకు. ఉన్న దేశంలో శాంతిభద్రతల్ని కాపాడాలంటూ పాక్ ప్రభుత్వానికి హితువు పలికాడు.
అంతేకాదు కశ్మీర్ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్కు కశ్మీర్ అవసరం లేదు. అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దు. కశ్మీర్ ప్రత్యేక దేశం కావాలి. అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలువురు నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. సొంత దేశంపై విమర్శలు చేస్తున్న అఫ్రీది ఇలా మాట్లాడే అర్హత లేదని అంటున్నారు నెటిజన్లు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!