మరో 25 ఏళ్లుల్లో మార్స్ మీదకు మనిషి..
- November 15, 2018హూస్టన్: మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నది. అయితే మరో 25 ఏండ్లల్లో అరుణ గ్రహంపై మనుషులు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించే టెక్నాలజీ అభివృద్ధిని చేయాల్సి ఉందని నాసా తెలిపింది. మార్స్ గ్రహం భూమి నుంచి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అయితే చంద్రుడిపై అపోల్ వ్యోమనౌకను పంపినప్పుడు ఎన్ని ఇబ్బందులో ఎదురయ్యాయో అంత కన్నా ఎక్కువే ఇబ్బందులు ఉంటాయని నాసా పేర్కొన్నది. మార్స్ గ్రహం వెళ్లేందుకు కనీసం 9 నెలల ప్రయాణం ఉంటుందని, అయితే ఆ సమయంలో సౌర కాంతి నుంచి రేడియేషన్ ఉంటుందని, దానికి తగ్గట్లుగా షీల్డ్లను తయారు చేయాల్సి ఉంటుందని నాసా అభిప్రాయపడింది. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే, మార్స్ మిషన్ నిజం కావాలంటే కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని మాజీ ఆస్ట్రోనాట్ టామ్ జోన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం