చాల్లేదు.. ఇంకా కావాలి: విమానంలో మహిళ రచ్చ
- November 15, 2018
ఎవరన్నారు బాస్.. మహిళలు మగవారికంటే తక్కువని.. ఎందులోనూ తక్కువ కాదు.. మళ్లీ మాట్లాడితే రెండాకులు ఎక్కువే.. వారికైతే అడిగినంత పోస్తారు.. మాకు మాత్రం ఎందుకివ్వరు.. మద్యం మత్తు నషాళానికి ఎక్కినా మరికొంత కావాలంటూ అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషించింది ఓ నవ నాగరికురాలు.
అప్పటికే మోతాదుకు మించి మద్యాన్ని సేవించి ఉన్న ఐరిష్ మహిళ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో ప్రయాణిస్తోంది. సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి క్యాబిన్ క్రూ కమాండర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోసారి ఆమె మద్యం అడిగితే అస్సలు ఇవ్వొద్దని కమాండర్ సూచించారు.
అదే విషయం ఆమెకు చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. తీవ్రపదజాలంతో సిబ్బందిని దూషించింది. పైలట్ వద్దకు వచ్చి అతని మీద ఉమ్మి వేసింది. ఆమె అంత చేస్తున్నా పైలట్ ఏమాత్రం కోప్పడలేదు. ఇంతకీ ఆమె ఎవరూ అని ఆరా తీస్తే ఓ
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో లాయర్ అని తెలుసుకున్నారు విమాన సిబ్బంది.
బ్రిటన్కు చెందిన ఈ 50 ఏళ్ల లాయరమ్మ ఈనెల 10న ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. తనను తాను ఓ లాయర్ అని విమాన సిబ్బందిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఓ గ్లాస్ వైన్ కావాలని అడిగింది. అది తాగేసి మరో గ్లాస్ కావాలని కోరింది.
దీనికి సిబ్బంది నిరాకరించడంతో వారిని దుర్భాషలాడింది. అంతే కాకుండా మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తా, ఇండియన్స్ అయిన మీరు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో లండన్లోని హిత్రో విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!