కువైట్లో వర్షాలు: యూఏఈ నుంచి విమానాల రద్దు
- November 15, 2018
యూఏఈకి చెందిన అన్ని ఎయిర్ లైన్స్, తమ విమానాల్ని కువైట్కి వెళ్ళకుండా నిలువరించాయి. కువైట్లో వున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిసిఎ పేర్కొంది. కువైట్లో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. విమానాశ్రయాల్లోనూ వరద నీరు పోటెత్తుతోంది. దుబాయ్, అబుదాబీ సహా అనేక విమానాశ్రయాలనుంచి విమానాల్ని కువైట్కి నిలిపివేశారు. కువైట్లో స్కూళ్ళు సైతం మూతపడ్డాయి. గత ఐదు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క కువైట్లో యూఏఈ ఎంబసీ, తమ పౌరుల్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళరాదని పౌరుల్ని హెచ్చరించింది. కాగా, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్, తమ కంపెనీల్లో వర్క్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా వర్క్ని నిలిపివేయడం గమనార్హం. అనూహ్యంగా చోటు చేసుకున్న వరదలతో కువైట్లో పరిస్థితులు బీతావహంగా మారాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు