అమెరికాలో కాల్పులు, తెలంగాణ వ్యక్తి మృతి
- November 18, 2018
అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్కు చెందిన సునీల్ ఎడ్లాను అతని ఇంటి ముందు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఆఫీసు అయ్యాక సునీల్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలుడు అతనిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుడు సునీల్ వచ్చే వరకు వేచి చూసి, రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సునీల్ వయస్సు 61. కాల్పుల అనంతరం సునీల్ కారును తీసుకొని అతను పారిపోయాడు. సునీల్ తన తల్లి 95వ పుట్టిన రోజు వేడుకల కోసం మెదక్లోని సొంత ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సునీల్ తలపై కాల్చడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సునీల్ కారులో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జాడ తెలుసుకుని బాలుడిని అరెస్ట్ చేశారు. సునీల్ను ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరాలేదు. పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్ కావడంతో అతడి పేరును బయటకు రానీయడం లేదు. సునీల్ 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. సునీల్కు మెదక్, పశ్చిమ గోదావరి జిల్లాలలో బంధువులు ఉన్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!