పూల్‌లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 200,000 దిర్హామ్‌ల చెల్లింపు

- November 21, 2018 , by Maagulf
పూల్‌లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 200,000 దిర్హామ్‌ల చెల్లింపు

షార్జా:నాలుగేళ్ళ ఎమిరేటీ చిన్నారి, స్కూల్‌లోని పూల్‌లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. షార్జాలో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. 200,000 దిర్హామ్‌ల మొత్తాన్ని బాధిత చిన్నారి కుటుంబానికి బ్లడ్‌ మనీ కింద చెల్లించేందుకు స్కూల్‌ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెషన్‌ సందర్భంగా నాలుగేళ్ళ చిన్నారి స్విమ్మింగ్‌ పూల్‌లో మృతి చెందాడు. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com