'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !
- November 24, 2018
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. అంతకంతే ముందే రెండు పాటలని విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 3 ఒకటి, డిసెంబర్ 7న మరో పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ 2.ఓ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!