'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !

- November 24, 2018 , by Maagulf
'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !

కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ 'పేట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. అంతకంతే ముందే రెండు పాటలని విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 3 ఒకటి, డిసెంబర్ 7న మరో పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. 

ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ 2.ఓ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com