ఇసుకలో కూరుకుపోయిన వాహనం: దొంగల పట్టివేత
- November 26, 2018
యూ.ఏ.ఈ:దొంగలు ప్రయాణిస్తున్న వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో ఆ దొంగలు పట్టుబడ్డారు. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీ నుంచి బిల్డింగ్ మెటీరియల్స్ని దొంగిలించిన నిందితులు, ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అనంతరం దొంగిలించిన మెటీరియల్తో వాహనంలో పారిపోతుండగా, వారి వాహనం ఇసుకలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని ఇసుకలో వదిలేసి నిందితులు పారిపోయారు. మార్చి 21న ఈ దొంగతనం జరిగింది. దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ని ఆసుపత్రిలో విచారించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఆదివారం జరిగిన హియరింగ్లో నిందితులపై అభియోగాలు నిరూపించబడలేదు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు