తెలంగాణ లో మోడీ బహిరంగ సభ
- November 27, 2018
తెలంగాణ:కొందరి పాదాల దగ్గర పడుండే వ్యక్తులకు కాకుండా ప్రజల పాదాల దగ్గర పడుండే వ్యక్తులకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అధికారంలో ఎవరున్నా తమకు తలవంచాల్సిందే అని మజ్లిస్ పార్టీ అంటోందన్న మోదీ, ఆ పార్టీకి సలాం చేసే పార్టీలను ఇంటికి పంపించాల్సిన సమయమొచ్చిందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒకే నాణానికి రెండు పార్శ్వాలని ఘాటుగా విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలి వచ్చారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఒక కుటుంబ సంతోషం తెలంగాణ ఉద్యమం సాగిందా అని ప్రశ్నించారు. కృష్ణా నది ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయని నిలదీశారు. పాలమూరు వెనకబాటుతనపై టీఆర్ఎస్, కాంగ్రెస్లను నిలదీయాలన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







