యూఏఈ మొబైల్ నెట్వర్క్స్కి కొత్త పేర్లు
- November 28, 2018యూఏఈ టెలికమ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ డు మరియు ఎటిసలాట్ తమ నెట్ వర్క్స్ పేర్లను '30 నవంబర్'గా మార్చాయి. కమ్మొమరేషన్ డే (గతంలో మార్టీర్స్ డేగా వ్యవహరించేవారు) గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా సంస్థలు. అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేసుకునేందుకు తమవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎటిసలాట్, ట్విట్టర్లో పేర్కొంది. ప్రతి యేడాదీ నవంబర్ 30వ తేదీని కమ్మొమరేషన్గా పాటిస్తూ వస్తున్నారు. తొలి ఎమిరేటీ, దేశం కోసం ప్రాణం విడిచిన రోజు అది. ఉదయం 8 గంటలకు యూఏఈ ఫ్లాగ్ హాఫ్ మాస్ట్ జరుగుతుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఒక నిమిషంపాటు మౌనం పాటిస్తారు. మినిస్టర్స్, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఫ్లాగ్ని రెయిజ్ చేస్తారు.. జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఇదిలా వుంటే, ఎటిసలాట్.. డు వినయోగదారులు నెట్ వర్క్ పేరు మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ