యూఏఈ మొబైల్ నెట్వర్క్స్కి కొత్త పేర్లు
- November 28, 2018
యూఏఈ టెలికమ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ డు మరియు ఎటిసలాట్ తమ నెట్ వర్క్స్ పేర్లను '30 నవంబర్'గా మార్చాయి. కమ్మొమరేషన్ డే (గతంలో మార్టీర్స్ డేగా వ్యవహరించేవారు) గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా సంస్థలు. అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేసుకునేందుకు తమవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎటిసలాట్, ట్విట్టర్లో పేర్కొంది. ప్రతి యేడాదీ నవంబర్ 30వ తేదీని కమ్మొమరేషన్గా పాటిస్తూ వస్తున్నారు. తొలి ఎమిరేటీ, దేశం కోసం ప్రాణం విడిచిన రోజు అది. ఉదయం 8 గంటలకు యూఏఈ ఫ్లాగ్ హాఫ్ మాస్ట్ జరుగుతుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఒక నిమిషంపాటు మౌనం పాటిస్తారు. మినిస్టర్స్, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఫ్లాగ్ని రెయిజ్ చేస్తారు.. జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఇదిలా వుంటే, ఎటిసలాట్.. డు వినయోగదారులు నెట్ వర్క్ పేరు మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







