5,000 ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ బ్లాక్డ్
- December 06, 2018స్మార్ట్ సిస్టమ్ ద్వారా యూఏఈలో 5,000 సోషల్ మీడియా అకౌంట్స్ని బ్లాక్ చేసినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. ఆన్లైన్ ఫ్రాడ్కి వ్యతిరేకంగా దుబాయ్ పోలీస్ అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫేక్ అకౌంట్స్ బ్లాకింగ్పై వివరాల్ని వెల్లడించారు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ సలెమ్ అల్ జలాఫ్. ఈ క్రమంలో ఎటిసలాట్ సంస్థతో కలిసి పనిచేశామని ఆయన వివరించారు. ఎటిజలాట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ జరౌని మాట్లాడుతూ, 2017 సెకెండాఫ్ నుంచి ఇప్పటివరకు 5,000 ఫేక్ అకౌంట్స్ని బ్లాక్ చేశామని చెప్పారు. ఆన్లైన్ ఫ్రాడ్పై చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన అన్నారు. 'బివేర్ ఆఫ్ ఫాల్స్ అకౌంట్స్' పేరుతో దుబాయ్ పోలీస్, అవేర్నెస్ డ్రైవ్ చేపట్టింది. సైబర్ క్రిమినల్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ని విరివిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్