హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రవేశంపై పిటిషన్ దాఖలు
- December 07, 2018
న్యూఢిల్లీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా గర్భగుడిలోకి మహిళలను ప్రవేశానికి అనుమతినివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పుణెకు చెందిన లా మహిళ విద్యార్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నవంబర్ 27న దర్గాను సందర్శించిన సమయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించే విధంగా వెలుపల ఒక నోటీసు బోర్డును ఉంచారని పిటిషన్ పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దర్గాలో మహిళల ప్రవేశాన్ని నిర్దారించే మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, దర్గా ట్రస్ట్కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, లింగ బేధా ఆధారంగా ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించడం రాజ్యాంగ ముసాయిదాకి విరుద్ధమని పేర్కొంది. లా విద్యార్థుల తరుపున న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల శబరిమలలో మహిళందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. అజ్మీర్ షరీఫ్ దర్గా, హజీ అలీ దర్గాలో మహిళలను అనుమతించడాన్ని కూడా పిటిషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









