మిస్సింగ్‌ వలసదారుడి మృతి

- December 11, 2018 , by Maagulf
మిస్సింగ్‌ వలసదారుడి మృతి

బహ్రెయిన్: భారత జాతీయుడైన వలసదారుడొకరు హిద్‌ ప్రాంతంలోని తన కారులో మృతి చెందారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అపార్ట్‌మెంట్‌ నుంచి అతను వెళ్ళి, ఎంత సేపటికీ తిరిగి రాలేదని పేర్కొంటూ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. మృతుడ్ని సతీష్‌కుమార్‌గా గుర్తించారు. సోషల్‌ మీడియా వేదికగా, సతీష్‌కుమార్‌ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొనగలిగినా, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. గత ఏడాది సతీష్‌కుమార్‌కి స్ట్రోక్‌ వచ్చిందనీ, అదే అతని మృతికి కారణమయి వుండొచ్చని అనుమానిస్తున్నారు. బహ్రెయిన్‌లో 30 ఏళ్ళుగా సతీష్‌కుమార్‌ నివసిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com