మిస్సింగ్ వలసదారుడి మృతి
- December 11, 2018
బహ్రెయిన్: భారత జాతీయుడైన వలసదారుడొకరు హిద్ ప్రాంతంలోని తన కారులో మృతి చెందారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అపార్ట్మెంట్ నుంచి అతను వెళ్ళి, ఎంత సేపటికీ తిరిగి రాలేదని పేర్కొంటూ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. మృతుడ్ని సతీష్కుమార్గా గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా, సతీష్కుమార్ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొనగలిగినా, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. గత ఏడాది సతీష్కుమార్కి స్ట్రోక్ వచ్చిందనీ, అదే అతని మృతికి కారణమయి వుండొచ్చని అనుమానిస్తున్నారు. బహ్రెయిన్లో 30 ఏళ్ళుగా సతీష్కుమార్ నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







