మిస్సింగ్ వలసదారుడి మృతి
- December 11, 2018
బహ్రెయిన్: భారత జాతీయుడైన వలసదారుడొకరు హిద్ ప్రాంతంలోని తన కారులో మృతి చెందారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అపార్ట్మెంట్ నుంచి అతను వెళ్ళి, ఎంత సేపటికీ తిరిగి రాలేదని పేర్కొంటూ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. మృతుడ్ని సతీష్కుమార్గా గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా, సతీష్కుమార్ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొనగలిగినా, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. గత ఏడాది సతీష్కుమార్కి స్ట్రోక్ వచ్చిందనీ, అదే అతని మృతికి కారణమయి వుండొచ్చని అనుమానిస్తున్నారు. బహ్రెయిన్లో 30 ఏళ్ళుగా సతీష్కుమార్ నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









