ముంబయి:ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు మృతి
- December 17, 2018
ముంబయి: ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని ఈఎస్ఐసి కామ్ గార్ ఆసుపత్రిలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మూడవ అంతస్థులో ఈ ప్రమాదం జరగగా ఇప్పటికే ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మూడో అంతస్తులో మంటలు వ్యాపించడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది గోడలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఆసుపత్రిలోని రోగులు, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 10 అగ్ని మాపక దళాలు, 16 అంబులెన్స్ లు ఘటనా స్థలంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









