ముంబయి:ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు మృతి
- December 17, 2018ముంబయి: ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని ఈఎస్ఐసి కామ్ గార్ ఆసుపత్రిలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మూడవ అంతస్థులో ఈ ప్రమాదం జరగగా ఇప్పటికే ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మూడో అంతస్తులో మంటలు వ్యాపించడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది గోడలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఆసుపత్రిలోని రోగులు, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 10 అగ్ని మాపక దళాలు, 16 అంబులెన్స్ లు ఘటనా స్థలంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..