రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరార్
- December 18, 2018
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. నాలుగు రోజులపాటు ఆయన నగరంలోనే బస చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతి పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 21న హైదరాబాద్కు రానున్న కోవింద్.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 24వరకు బస చేయనున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ నెల 21న సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికిబయల్దేరి వెళ్తారు. పర్యటనకు సంబంధించి తగిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, స్వాగత తోరణాలు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీటీవీలు, వైద్య బృందాలు, టెలిఫోన్, పత్రికలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కరీంనగర్లో ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 23న రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం నిర్వహించి 24వ తేదీన తిరిగి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







