ఆగస్టు 15 విడుదలకి ఫిక్సయిన 'సాహో'
- December 18, 2018
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. శ్రద్దాకపూర్ హీరోయిన్. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. ఆగస్టు 15కి వెళ్లిందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ డేటుని అధికారంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. జెండా పండగ (ఆగస్టు 15) రోజున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
2019లో రాబోయే భారీ సినిమా సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక, సాహో తో పాటు షూటింగ్ జరుపుకొంటున్న మరో భారీ సినిమా మెగాస్టార్ 'సైరా' విడుదల ఇంకా తేది ఇంకా ఖరారు కాలేదు. సైరా 2020 సంక్రాంతి రాబోతుందని తెలుస్తోంది.
ఇక, సాహో ఆగస్టు 15కి వెళ్లడంతో సమ్మర్ సీజన్ లో వచ్చే సినిమాలకి ఇబ్బంది తొలగినట్టయింది. మహేష్ మహర్షి సినిమా ఒకటి సమ్మర్ కే వస్తుంది. ఏప్రియల్ 5న మహర్షి విడుదల కాబోతుంది. నాని 'జెర్సీ' కూడా ఏప్రియల్ లోనే అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలు సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!