అబుధాబిలో ఇండియన్ మ్యాన్ మిస్సింగ్
- December 18, 2018
అబుధాబి:భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి అబుధాబిలో మిస్సింగ్ అయ్యారు. కుటుంబ సభ్యులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మిస్సింగ్ అయిన వ్యక్తిని 27 ఏళ్ళ హారిస్ పోమాదాత్గా గుర్తించారు. డిసెంబర్ 8న అల్ షమ్కా ప్రాంతం నుంచి ఆ వ్యక్తి తప్పిపోయినట్లు సోదరుడు సుహైల్ పేర్కొన్నారు. తన సోదరుడు ఓ రెస్టారెంట్లో ఏడాదిగా డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సొహెయిల్ తెలిపారు. తనను కలిసేందుకు అల్ సమ్కా వస్తున్నట్లు డిసెంబర్ 8న తన సోదరుడు చెప్పారనీ, అవే అతని చివరి మాటలని సుహైల్ తెలిపారు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారు. ఇండియన్ ఎంబసీకి కూడా తన సోదరుడి మిస్సింగ్పై ఫిర్యాదు చేశామనీ, తమ సోదరుడి ఆచూకీ లభిస్తుందనే నమ్మకం వుందని సుహైల్ అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







