స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..

- December 22, 2018 , by Maagulf
స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..

దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ కనబడుతుంది. జోమాటో, ఫుడ్ ఫండా, ఉబర్ ఈట్స్  వంటి వాటి పోటీని తట్టుకుని మరీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ కంపెనీ నిలదొక్కుకుంది. దాదాపు దేశ వ్యాప్తంగా తన నెట్ వర్క్‌ను విస్తరించేందుకు గానూ స్విగ్గీ ఇప్పటికే నిధుల సమీకరణను ప్రారంభించింది.

గతంలో నాస్పెర్, DST గ్లోబల్  వంటి కంపెనీలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. వీటి విలువ రూ. 1500 కోట్లుగాఉంది. తాజాగా స్విగ్గీ కంపెనీ మరో రూ. 7000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది.  టెన్సెంట్, హిల్ హౌజ్  క్యాపిటల్స్, వెల్లింగ్ టన్ మేనేజ్‌మెంట్ కంపెనీల నుండి  ఈ నిధులు సేకరించినట్టు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com