33 వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం!

- December 22, 2018 , by Maagulf
33 వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం!

న్యూఢిల్లీ: ఇటివల ప్రధాని నరేంద్ర మోడి వస్తు,సేవల పన్ను (జీఎస్టీ)లను మరింత సలుభతరం చేస్తామని చెప్పారు. అయితే ఆ దిశగా జీఎస్టీ మండలి చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో దిల్లీలో భేటీ అయిన జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది. 7 వస్తువులపై పన్నులను 28 నుంచి 18శాతానికి తగ్గించాలని నిర్ణయించిన జీఎస్టీ మండలి మరో 26 వస్తువులపై 18నుంచి 12 శాతం, 5శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఫిట్‌మెంట్‌ కమిటీ భేటీ అయి మిగిలిన వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుతం జీఎస్టీ మండలి భేటీ ఢిల్లీలో కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com