భారత్: అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన ప్రారంభం
- December 25, 2018
దేశంలోనే అతిపెద్ద రోడ్ కం రైల్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని సిలాఫథార్ వరకూ బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఉన్న ఈ బోగీబీల్ వంతెన నిర్మించారు. స్థానికంగా రవాణాసౌకర్యాలు మెరుగుపరచడంలో ఇది అత్యంత కీలకమవుతుంది. చైనా సరిహద్దులవైపు రక్షణ పరంగా సైన్యాన్ని తరలించేందుకు, ఆయుధాలు తీసుకెళ్లేందుకు ఈ బ్రిడ్జి కీలకంగా మారుతోంది. ఈ వంతెనపై తొలి ప్యాసెంజర్ రైల్ రాకపోకలను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభిస్తారు. దీనివల్ల ఢిల్లీ నుంచి దిబ్రూఘర్కు దాదాపు 4 గంటల జర్నీ టైమ్ తగ్గుతుంది. ఇక అస్సాంలోని తిన్సుకియా నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని నహర్లగన్కు 10 గంటల సమయం తగ్గుతుంది. అంటే, 500 కిలోమీటర్ల దూరం ఇప్పుడు 100 కిలోమీటర్లకు తగ్గుతుంది.
ఈ బోగీబీల్ వంతెన పొడవు 5 కిలోమీటర్లు. కింద రైళ్ల కోసం డబుల్ ట్రాక్ ఉంటుంది. పైన మూడు లైన్ల రహదారి ఉంటుంది. దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగానే చెప్పాలి. దాదాపు 5వేల 920 కోట్లతో దీన్ని నిర్మించారు. దాదాపు 21 ఏళ్ల కల నేడు సాకారం అవుతోంది. 1997లో ఈ బోగీబీల్ వంతెన నిర్మించాలని తలపెట్టారు. అప్పటి ప్రధాని దేవెగౌడ శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత వాజ్పేయి హయాంలో 2002లో పనులకు బీజం పడింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పూర్తవడంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ఇదో వరంగా మారిందనే చెప్పాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!