శ్రీదేవి కోసమే ఆ సినిమా చూసాం అంటున్న అభిమానులు
- December 25, 2018బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికల పాత్రలు పోషించారు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకుని, దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవిని చివరిసారిగా చూసిన అభిమానులు ఆవేదన చెందారు.
ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించింది. ఆమె మరణం తర్వాత తొలిసారి తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో అభిమానులు బాధపడ్డారు. శ్రీదేవిని చూడటానికే సినిమాకు వెళ్లినట్లు కొందరు తెలిపారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. 'జీరో'లో శ్రీదేవి ఫొటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్మీడియాలో వైరల్గా మారాయి. 'శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్పై చూడటానికి సినిమాకు వెళ్లా, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్ మౌనంగా ఉండిపోయింది, 'జీరో'లో శ్రీదేవి నా అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారు, ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయా, శాశ్వతమైన తార శ్రీదేవి కోసం 'జీరో' చూశా, మళ్లీ స్క్రీన్పై శ్రీదేవిని చూడటం బాగుంది, ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.. కానీ ఇప్పుడు మనతో లేరు..' అంటూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..