శ్రీదేవి కోసమే ఆ సినిమా చూసాం అంటున్న అభిమానులు
- December 25, 2018
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికల పాత్రలు పోషించారు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకుని, దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవిని చివరిసారిగా చూసిన అభిమానులు ఆవేదన చెందారు.
ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించింది. ఆమె మరణం తర్వాత తొలిసారి తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో అభిమానులు బాధపడ్డారు. శ్రీదేవిని చూడటానికే సినిమాకు వెళ్లినట్లు కొందరు తెలిపారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. 'జీరో'లో శ్రీదేవి ఫొటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్మీడియాలో వైరల్గా మారాయి. 'శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్పై చూడటానికి సినిమాకు వెళ్లా, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్ మౌనంగా ఉండిపోయింది, 'జీరో'లో శ్రీదేవి నా అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారు, ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయా, శాశ్వతమైన తార శ్రీదేవి కోసం 'జీరో' చూశా, మళ్లీ స్క్రీన్పై శ్రీదేవిని చూడటం బాగుంది, ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.. కానీ ఇప్పుడు మనతో లేరు..' అంటూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..