భార్య మృతి: బ్లడ్ మనీ చెల్లించిన భర్త
- December 26, 2018
25 ఏళ్ళ భారతీయ మహిళ దివ్య ప్రవీణ్, రస్ అల్ ఖైమాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె భర్త 200,000 బ్లడ్ మనీ చెల్లించాల్సి వచ్చింది. అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు ఈ బ్లడ్ మనీని ఆమె భర్త చెల్లించారు. అలాగే 2,500 జరీమానా సైతం డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కి విధించడం జరిగింది. రస్ అల్ ఖైమా - ఇండియన్ రిలీఫ్ కమిటీ సోసల్ వర్కర్ పుష్పన్ గోవిందన్ మాట్లాడుతూ, 200,000 బ్లడ్ మనీ, 2,500 దిర్హామ్ల జరీమానా చెల్లించాక ప్రవీణ్ విడుదలయినట్లు చెప్పారు. ఇండియన్ రిలీఫ్ కమిటీ వలంటీర్ రఘు మాష్ మాట్లాడుతూ, ప్రవీణ్ స్నేహితులు, బంధువులు బ్లడ్ మనీని కోర్టుకు చెల్లించారని అన్నారు. ప్రవీణ్కి రెండేళ్ళ కుమారుడున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ తర్వాత మృతదేహంతో ప్రవీణ్ ఇండియాకి బయల్దేరారు. ప్రవీణ్, రస్ అల్ ఖైమా హట్చిసన్ పోర్ట్స్లో పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రవీణ్ ప్రాణాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!