విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!
- December 28, 2018
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలించామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర చెప్పారు. అమెరికాలోని విమానాశ్రయాల్లో ఉన్న బాడీ స్కానర్లను మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ద్వార వేగంగా సిబ్బంది లేకుండా ప్రయాణికులను తనిఖీ చేయవచ్చని కుమార్ రాజేష్ పేర్కొన్నారు. బాడీ స్కానర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఉన్నందువల్ల వీటికి ఆటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వచ్చే రెండేళ్లలోగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇండియా ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







