విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!
- December 28, 2018
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలించామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర చెప్పారు. అమెరికాలోని విమానాశ్రయాల్లో ఉన్న బాడీ స్కానర్లను మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ద్వార వేగంగా సిబ్బంది లేకుండా ప్రయాణికులను తనిఖీ చేయవచ్చని కుమార్ రాజేష్ పేర్కొన్నారు. బాడీ స్కానర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఉన్నందువల్ల వీటికి ఆటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వచ్చే రెండేళ్లలోగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇండియా ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







