భూటాన్‌కు 4500 కోట్ల సాయం ప్రకటించిన మోదీ

- December 28, 2018 , by Maagulf
భూటాన్‌కు 4500 కోట్ల సాయం ప్రకటించిన మోదీ

భూటాన్ దేశానికి భారత్ 4500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ భూటాన్ ప్రధాని లొటాయ్ సెరింగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భూటాన్ హైడ్రో పవర్ సహకారం కీలకం అని మోదీ అన్నారు. మంగడేచ్చు ప్రాజెక్టును పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సెరింగ్ ఘన విజయం సాధించారు. భూటాన్ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 4500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రధాని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com