భూటాన్కు 4500 కోట్ల సాయం ప్రకటించిన మోదీ
- December 28, 2018భూటాన్ దేశానికి భారత్ 4500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ భూటాన్ ప్రధాని లొటాయ్ సెరింగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భూటాన్ హైడ్రో పవర్ సహకారం కీలకం అని మోదీ అన్నారు. మంగడేచ్చు ప్రాజెక్టును పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సెరింగ్ ఘన విజయం సాధించారు. భూటాన్ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 4500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రధాని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ