విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!
- December 28, 2018
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలించామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర చెప్పారు. అమెరికాలోని విమానాశ్రయాల్లో ఉన్న బాడీ స్కానర్లను మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ద్వార వేగంగా సిబ్బంది లేకుండా ప్రయాణికులను తనిఖీ చేయవచ్చని కుమార్ రాజేష్ పేర్కొన్నారు. బాడీ స్కానర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఉన్నందువల్ల వీటికి ఆటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వచ్చే రెండేళ్లలోగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇండియా ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!