విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!
- December 28, 2018దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలించామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర చెప్పారు. అమెరికాలోని విమానాశ్రయాల్లో ఉన్న బాడీ స్కానర్లను మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ద్వార వేగంగా సిబ్బంది లేకుండా ప్రయాణికులను తనిఖీ చేయవచ్చని కుమార్ రాజేష్ పేర్కొన్నారు. బాడీ స్కానర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఉన్నందువల్ల వీటికి ఆటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వచ్చే రెండేళ్లలోగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇండియా ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ